Friday, November 1, 2013

స్త్రీ , పురుషులు ఇద్దరూ అనుసరించి పాటించిననాడే పవిత్రమైన వివాహం పరమార్ధ స్థితిని చేరుకొంటుంది. భార్య భర్తకు , భర్త భార్యకు తోడునీడగా, అన్యోన్యం గా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో జీవిస్తేనే ప్రమాణాలకు ఒక విలువ వుంటుంది.



* బ్రహ్మముడి *
ధృవం తే రాజా వరుణో ధృవం తే నో బృహస్పతి:
ధృవంత ఇంద్రశ్చాగ్ని రాష్ట్రం ధారయతాం ధృవం !!

దాంపత్య సామ్రాజ్యమున ధరించునట్టి మీకు రాజగు వరుణుడును, దేవుడగు బృహస్పతియు, ఇంద్రుడును, అగ్నియు నిశ్చలత్వము కలుగచేయుదురు. ( ముడిని కేంద్రముగా చేయుదురు గాక ). అని పై మంత్రము చదువుతూ బ్రాహ్మణుడు వధూవరుల కొంగులు ముడి వేస్తారు. బ్రాహ్మణుడు బ్రహ్మముడి వేసాక వధూవరులు ఇద్దరూ అగ్నిహోత్రము వద్దకు వచ్చి నమస్కరిస్తారు.

No comments:

Post a Comment